న్యూఢిల్లీ, డిసెంబర్ 09 : కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం మరదలిపై హోటల్ కబ్జా కేసు నమోదైంది. చిదంబరం భార్య చెల్లెలు పద్మిని, 2007లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నతాధికారులతో కలిసి చెన్నైలోని తన హోటల్ను కబ్జా చేసింద౦టూ డాక్టర్ కే కత్తివేలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా పద్మిని కొన్ని నెలల క్రితం మరణించింది. మరోవైపు చిదంబరం కొడుకు కార్తి, ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో జారీ అయిన సీబీఐ సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో వాదనలు వింటామని ధర్మాసనం పిటిషనర్కు తెలియజేసింది.