గుజరాత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

SMTV Desk 2017-12-09 10:46:26  gujarath elections, poling started, bjp, congress.

గాంధీనగర్‌, డిసెంబర్ 09 : గుజరాత్‌ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 89 నియోజకవర్గాల్లో జరగనున్న ఈ పోలింగ్‌ లో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు శక్తిసిన్‌ గోహిల్‌, పరేష్‌ ధనానీతో సహా పలువురు అభ్యర్థులు తొలిదశ బరిలోనే ఉన్నారు. ఈ పోలింగ్ లో మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే మిగిలిన స్థానాలకు ఈ నెల 14న పోలింగ్‌ నిర్వహించనున్నారు. కాగా మోదీ ప్రధాని అయిన తర్వాత గుజరాత్‌లో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం విశేషం. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.