తెలుగు మహా సభలను నిర్వహించడం మంచిదే : వీహెచ్

SMTV Desk 2017-12-08 19:01:17  Congress leader V. Hanumantha Rao, telugu maha sabhalu, gulf.

హైదరాబాద్, డిసెంబర్ 08 : కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు.. ప్రపంచ తెలుగు మహాసభలకు గల్ఫ్ బాధితులను ఆహ్వానించాలన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగు మహా సభలను నిర్వహించడం మంచిదేనన్నారు. తెలంగాణ ప్రజలు గల్ఫ్ దేశాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యమంత్రి వారి బాధితులను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. కేసీఆర్ వెంటనే స్పందించి గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు.