న్యూఢిల్లీ, డిసెంబర్ 8: టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్లకు ధీటుగా ఐడియా సరికొత్త ప్యాక్ను విడుదల చేసింది. ఈ ప్యాక్ ప్రీపెయిడ్ కస్టమర్ల కొరకై ప్రవేశపెట్టింది. దీని కింద రోజుకు 1జీబీ 3జీ డేటాతో పాటు అపరిమిత ఉచిత కాల్స్(హోమ్, నేషనల్ రోమింగ్), రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను 84 రోజుల పాటు ఆఫర్ చేయనుంది. దీని కోసం ఐడియా కస్టమర్లు రూ.509తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదే టారిఫ్తో ఎయిర్టెల్,వోడాఫోన్లు పోటి పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో ఐడియా కొత్తగా చేరింది.