ముంబాయి, డిసెంబర్ 8: అన్ని రంగాల షేర్లలో బుల్ పరుగులు తీసింది. రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి. 150 పాయింట్ల లాభంతో ఆరంభమైన సెన్సెక్స్.. 301 పాయింట్లు లాభపడి 33,250 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 99 పాయింట్లు ఎగబాకి 10,266 వద్ద ముగిసింది. డాలర్ రూపాయి మారకం విలువ రూ. 64.47గా కొనసాగుతోంది. నిఫ్టీలో మెటల్ షేర్లు మెరుపులు మెరిపించాయి. మెటల్స్తో పాటు ఫార్మా, ఆటో షేర్లు కూడా 1 శాతం పైగా లాభాలు పండించాయి. మిడ్ క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో కొనగోళ్ల వెల్లువ కొనసాగింది.