ఎయిర్‌ఏసియా ఎక్సలెంట్ ఆఫర్స్...

SMTV Desk 2017-12-08 16:43:41  airasia offeres, hyderabad to buvaneshwar,

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: నూతన సంవత్సరం రాబోతున్న సందర్బంగా టెలికాం, మొబైల్ ఉత్పత్తుల సంస్థలు, భారీ ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో ఎయిర్‌ ఏసియా చేరింది. తాజాగా ఎయిర్‌ఏసియా తన వెబ్ సైట్ లో 2018 జనవరి 1 నుంచి కొత్త రూట్లకు రూ.1,999కే టిక్కెట్‌ ధరలు ప్రారంభమవుతాయని పేర్కొంది. హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వరకు రోజూ డైరెక్ట్‌ విమానాలను లాంచ్‌ చేసింది. ఈ కొత్త మార్గానికి అడ్వాన్స్‌గా టిక్కెట్‌ బుక్‌ చేసుకునే వారికి, డిస్కౌంట్‌ ధరలు అందుబాటులో ఉంటాయని, ఈ ఆఫర్ కింద డిసెంబర్‌ 10 వరకు టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. కేవలం వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టిక్కెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్‌ ధర రూ.1999లోనే 20కేజీల బ్యాగేజ్‌, ఒకపూట ఆహారం ఉండనుంది. ఈ భారీ డిస్కౌంట్ల ఆఫర్స్ ప్రయాణికులను ఆకట్టుకోవడానికి దేశీయ విమానయాన సంస్థలు ప్రకటిస్తున్నాయని తెలుస్తోంది.