అయోధ్య కేసుపై ఆశాభావ౦ : బీజేపీ నేత తపన్ భౌమిక్

SMTV Desk 2017-12-08 15:31:09  AYODHYA CASE ISSUE, BJP PARTY, TAPAN BHOWMIK.

న్యూఢిల్లీ, డిసెంబర్ 08 : అయోధ్య కేసు వివాదంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంపై బీజేపీ పార్టీకి చెందిన తపన్ భౌమిక్ ఆశాభావ౦ వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని, అలా రాకపోతే బీజేపీ నేతలే రామ మందిరం నిర్మిస్తామనే హామీ ఇస్తారని వెల్లడించారు. ఈ కోర్టు తీర్పు తర్వాత లోక్ సభలో ఉన్న బీజేపీ సభ్యులు నిబంధనలను రూపొంది౦చి, అయోధ్యలో ఉన్న అదే స్థలంలో ఆలయ నిర్మాణ౦ చేపట్టడానికి అనుకూలంగా బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది.