న్యూఢిల్లీ, డిసెంబర్ 8: భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. గత వారం టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీలో రన్నరప్గా నిలిచిన యువ షట్లర్ లక్ష్యసేన్ తొలిసారి టాప్–100లో చోటు సంపాదించుకున్నాడు. ఏకంగా 19 స్థానాలు ఎగబాకి 89వ ర్యాంకుకు చేరుకున్నాడు. హెచ్ఎస్ ప్రణయ్ 10, సాయి ప్రణీత్ 17 వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు మూడో ర్యాంకులో, సైనా నెహ్వాల్ పదో ర్యాంకుల్లో ఎటువంటి మార్పు లేదు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్–సిక్కి జోడి 19వ ర్యాంకులో ఉంది.