హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ క్రీడాకారిణి ఐటీఎఫ్ జూనియర్స్ టోర్నీలో ప్రతిభను చాటింది. బాలికల విభాగంలో అమినేని శివాని సింగిల్స్ విభాగంలో సెమీస్కు, డబుల్స్ విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లింది. క్వార్టర్స్లో శివాని (భారత్)6–3, 6–3తో షియోరి ఇటో (జపాన్)పై గెలుపొందింది. మరోవైపు సెమీస్లో టాప్ సీడ్ శివాని– ఆకాంక్ష (భారత్) ద్వయం 4–6, 6–3, 10–8తో చే హ్యూన్ (కొరియా)– డోగా (టర్కీ) జోడీపై విజయాన్ని సాధించింది. బాలుర విభాగంలో తీర్థ శశాంక్ పోరాటం క్వార్టర్స్లో (భారత్) 5–7, 4–6తో సచిత్ శర్మ చేతిలో ఓటమితో ముగిసింది.