ముంబాయి, డిసెంబర్ 08 : సినిమారంగంలో చాలా మంది కథలు రాసే రచయితలు ఉన్నారు. కానీ వారికి అవకాశాలు దొరక్క ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం సినీస్ఠాన్ ఇండియా కథల పోటీని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు ఆమీర్ఖాన్, దర్శకుడు రాజు హీరానీ, స్క్రీన్ ప్లే రచయితలు జుహీ చతుర్వేది, అంజూయ్ రాజాబాలీ న్యాయనిర్ణేతలుగా ఉండనున్నారు. ఇండియాలోనే ఇది అతి పెద్ద రచనల పోటీ అనీ, అత్యుత్తమ కథకు రూ. 25 లక్షలు బహుమతిగా ఇస్తామనీ, ఈ పోటీలో మొత్తం నగదు బహుమతులు రూ. 50 లక్షల వరకూ ఉంటుందని సినీస్థాన్ డిజిటల్ ఛైర్మన్ రోహిత్ ఖత్తార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమీర్ఖాన్ మాట్లాడుతూ " ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది." అని తెలిపారు.