గంగానదీ తీరంలో దీక్ష చేయనున్న స్వరూపానందేంద్ర

SMTV Desk 2017-06-15 18:38:25  Ganga River, Swaroopa Nandendra,

పెందుర్తి, జూన్ 15 : చాతుర్మాస దీక్ష నిమిత్తమై విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ రిశికేశ్ లోని పవిత్ర గంగానదీ తీరానికి బుధవారం నగరం నుంచి పయనమయ్యారు. జూలై 9 నుంచి గంగానదీ తీరంలోని శారదాపీఠం శాఖలో స్వామిజి దీక్షను ప్రారంభించనున్నట్లు సమాచారం. దాదాపు మూడు నెలల పాటు అక్కడే ఉండి, పర్యటనలో భాగంగా ఈ నెల 18 న కాశీలో నిర్మిస్తున్న శారదాపీఠం శాఖను సందర్శించి భగవత్ పాదేశ్వర్ శివ లింగాన్ని ప్రతిష్టించనున్నట్లు వెల్లడించారు.