ముంబాయి, డిసెంబర్ 7: దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రా.29వేల దిగువన ట్రేడ్ అవుతూ వస్తుంది. బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ. 176 పతనమై రూ. 28,791కు చేరగా, మార్చి ఫ్యూచర్స్ రూ. 130 క్షీణించి రూ. 37,314ను తాకింది. ఈ విధంగా బంగారం ధరలు దిగి రావడానికి, పరిశ్రమలు, రిటైల్ వర్తకుల నుంచి డిమాండ్ తగ్గడమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.