హైదరాబాద్, డిసెంబర్ 07 : ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. "కేసీఆర్ కు ఎన్నికల ముందు బీసీలు గుర్తుకు వచ్చారా..? వారిపై అంత ప్రేమను చూపిస్తున్న ఆయన మంత్రి వర్గంలో కేవల౦ నలుగురు బీసీలు మాత్రమే ఎందుకు ఉన్నారో చెప్పి తీరాలి. ఒకవేళ ఆయనకు అంత ప్రేమే ఉంటే కేబినెట్లో బీసీల సంఖ్య తొమ్మిదికి పెంచాలి" అంటూ దుయ్యబట్టారు.