ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్తే రివార్డు : రైల్వే బోర్డు

SMTV Desk 2017-12-07 14:32:53  raiway board, online tickets booking, raiway Rewards for online transaction.

న్యూఢిల్లీ, డిసెంబర్ 07 : రైల్వేశాఖ.. క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా నెలవారి ట్రావెల్‌ పాస్‌లను కొనుగోలు చేసిన వారికి 0.5శాతం డిస్కౌంట్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరింత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకునే వారికి రివార్డులు ఇవ్వనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. అంతేకాదు టికెట్ల కొనుగోలుపై ఉచిత బీమా కూడా కల్పించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెల్లడించనుంది.