152 కు చేరిన మృతుల సంఖ్య

SMTV Desk 2017-06-15 17:57:56  Bangladesh,Rain,Rangamati district

ఢాకా, జూన్ 15: బంగ్లాదేశ్ లో బుధవారం వేకువ జామున కురిసిన భారీ వర్షం దాటికి కొండా చరియలు విరిగిపడ్డాయి. కొండ ప్రాంతమైన రంగమతి జిల్లాలో అధిక ప్రాణ నష్టం వాటిల్లింది. మృతి చెందిన వారి సంఖ్య 152 కు చేరింది. కొండచరియల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను వెలికితీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు బుధవారం తెలిపారు. భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న రంగమతి జిల్లాలో ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.