ముంబాయి, డిసెంబర్ 7: ట్రేడింగ్ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమై సెంచరీల భాట పట్టింది. ప్రస్తుతం సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా లాభంలో 32,804 వద్ద లాభాలు పండిస్తుండగా, నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 10,115 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకులు, ఆటో, మెటల్ స్టాక్స్ మద్దతుతో నేడు మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. రియల్టీ, ఆటో, పీఎస్యూ బ్యాంక్స్, మెటల్ రంగాలు 0.8-0.3 శాతం మధ్య ఉన్నాయి.