చెన్నై, డిసెంబర్ 07 : తమిళనాడు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఇటీవల స్వతంత్య్ర అభ్యర్థి, హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఇందు నిమిత్తం విశాల్ నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. "ప్రజలకు మంచి చేయాలని అనుకుంటే ఈ విధంగా సమస్యలు ఎదురవుతాయని అనుకోలేదు. అసలు తన నామినేషన్ ఎందుకు తిరస్కరించారో అర్ధం కాలేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయకూడదా..? ఈ ట్విస్టులతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఎన్నికల సంఘం వెనుక ఎవరు ఉన్నారనే విషయ౦ నాకు తెలీదు. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసే ఓ యువకుడికి నా మద్దతు తెలిపి అతడిని గెలిపిస్తా. అతని ద్వారా ఈ ప్రజలకు మంచి చేస్తా" అని విశాల్ ప్రకటించారు.