కోహ్లీ-అనుష్కల పెళ్లి వార్త నిజం కాదట..!

SMTV Desk 2017-12-07 10:33:05  virat kohli, anushka sharma,kohli wedding news,

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ప్రేమ జంట కనిపిస్తే చాలు నెట్టింట్లో వారి మీద విమర్శలు గుప్పుమంటాయి. తాజాగా భారత్ సారధి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ప్రేమ జంటపై ఓ వార్త షికారు చేస్తోంది. అదేంటంటే.. ఈ నెల 12న వీరిద్దరూ కలిసి ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారని అందుకే కోహ్లీ గురువారమే ఇటలీ బయల్దేరుతున్నాడని ప్రచారం మొదలైంది. అంతేకాదు ప్రస్తుతం శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు కోహ్లీ అందుబాటులో లేకపోవడం ఈ వార్తకు మరింతా బలాన్ని ఇచ్చింది. ఇలా వైరల్ అవుతున్న వార్తను అనుష్క శర్మ మేనేజర్‌ ఖండించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ పెళ్లి ప్రచార వార్తకు తెర పడింది.