వినూత్న రీతిలో అంగన్వాడీల నిరసన..

SMTV Desk 2017-12-06 18:31:24  anganwadi workers, protest on up government, cm yogi adhithyanath.

లఖ్‌నవూ, డిసెంబర్ 06 : అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత కొంతకాలంగా నిరసనలు చేపడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. అంగన్‌వాడీలు తమదైన రీతిలో వినూత్న౦గా నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఓ అంగన్వాడీ కార్యకర్త.. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడంలేదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వద్దకు గుర్రంపై వెళ్లి తేల్చుకుంటానని పేర్కొంది. మరోవైపు అంగన్‌వాడీ వర్కర్స్‌ అధ్యక్షురాలు నీతు సింగ్‌ యోగి ఫొటోకు పూలమాల వేసి నిరసన వ్యక్తం చేసింది. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని వెల్లడించింది.