న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఒకవైపు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడుతున్న టీంమిండియా క్రికెటర్లు.. మరోవైపు తమ స్నేహితుడి వివాహ రిసెప్షన్ వేడుకలలో సందడి చేశారు. ఢిల్లీలోని తాజ్మహల్ హోటల్లో మంగళవారం భారత క్రికెటర్ భువనేశ్వర్ కుమార్-నుపూర్ నగర్ ల రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విరాట్ కోహ్లీ, ధావన్, ఉమేశ్ యాదవ్,ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా తమ భార్యలతో కలిసి హాజరయ్యారు. ధోనీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్, భారత్ జట్టు మేనేజ్మెంట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. నవంబరు 23న వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.