అమరులైన సైనికుల పిల్లలను చదివిద్దాం : నేవీ చీఫ్‌

SMTV Desk 2017-12-06 17:25:14  Army jawans, Navy Chief Admiral Sunil Lamba, letter to Minister Nirmala Sita Raman

న్యూఢిల్లీ, డిసెంబర్ 06 : దేశ రక్షణలో నిరంతరం శ్రమిస్తూ అమరులైన సైనికుల పిల్లల చదువుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.10 వేలకు పరిమితం చేసింది. ఈ నిర్ణయం దాదాపు 3,400 చిన్నారుల భవిష్యత్‌పై ప్రభావం చూపించను౦డడంతో దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో "సైనికులు మన కోసం ప్రాణ త్యాగం చేశారు. వారి త్యాగాలు చాలా గొప్పవి. వారి పిల్లల చదువుకయ్యే ఖర్చుపై పరిమితిని విధించకండి. వారి కుటుంబాలకు అందించే సాయం వారికి భరోసాను కల్పిస్తుంది" అంటూ తెలిపారు. కాగా రక్షణ శాఖ కూడా ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.