విద్యార్ధిని పై బ్లేడ్ తో దాడి

SMTV Desk 2017-06-15 17:02:16  tirupathi, girl, boy, attack

తిరుపతి, జూన్ 15 : అమ్మాయిల మీద అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య ఇలాంటివి అమ్మాయిల మీద చాలా జరుగుతున్నాయి. అమ్మాయిలు కనిపిస్తే చాలు ప్రేమిస్తున్నాను అని వెంట పడటం వినక పొతే ఏమైనా చేయడానికి తెగిస్తున్నారు. ఇలాంటి సంఘటనే తిరుపతిలో జరిగింది. చిత్తూరు జిల్లా తిరుపతి కేఎంఎం కాలేజి సమీపంలో విద్యార్ధిని పై ఒక యువకుడు బ్లేడ్ తో దాడికి పాల్పడడు. ఈ దాడి లో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆ అమ్మాయిని పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. యువతి పై దాడి చేసిన యువకుడిని చంద్రగిరి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.