డిసెంబర్‌ 21న 2జీ స్పెక్ర్టమ్ కేసు తుది తీర్పు

SMTV Desk 2017-12-06 16:49:51  2-ji segment scam, The final verdict on December 21, Patiala court.

న్యూఢిల్లీ, డిసెంబర్ 06 : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ర్టమ్ కేసు గత ఆరేళ్లుగా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆ కుంభకోణం విచారణ ముగిసింది. కేసులో తుది తీర్పు డిసెంబర్‌ 21న వెలువడనుంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని పాటియాలా కోర్టు వెల్లడించింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎంపీ కనిమొళి ఇవాళ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో రాజా, కనిమొళితో పాటు మరో 19 మందిపై 2014లో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.