2020 వరకు ఢిల్లీలో నో మ్యాచ్...

SMTV Desk 2017-12-06 15:57:53  bcci, india, srilanka, delhi,

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఢిల్లీ వేదికగా ఫిరోజ్ షా కోట్లలో భారత్-శ్రీలంకల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో వాయుకాలుష్యం కారణంగా లంక ఆటగాళ్ళు మాస్క్ లు ధరించి మరి ఆడారు. అంతేకాదు భారత పేసర్ షమి మైదానంలో వాతులు కూడా చేసుకున్నాడు. విటన్ని౦టిని పరిగణలోకి తీసుకోని బీసీసీఐ ఓ నిర్ణయాన్ని తెలిపింది. స్టేడియం రొటేషన్ పాలసీ ప్రకారం 2020 వరకు ఢిల్లీలో ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగే అవకాశం లేదని స్పష్ట౦ చేసింది. ఈ సందర్బంగా 2019లో నూతన భవిష్యత్ టూర్ కార్యక్రమం (ఎఫ్ టీపీ) ప్రారంభమవుతుందని బీసీసీ అధికారి తెలిపారు.