న్యూఢిల్లీ, డిసెంబర్ 06 : నిత్యావసర సరకుల ధరలు ఎంత పెరిగాయో వివరిస్తూ ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధరల శాతాన్ని తప్పుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ కి లెక్కలు సరిగా రావా? అంటూ తెగ కామెంట్లు పెట్టారు. దీనిపై రాహుల్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. "నా భాజపా స్నేహితులందరికీ.. నేనూ మనిషినే. మనమంతా తప్పులు చేస్తాం. తప్పులు చేస్తుంటేనే జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. నా తప్పుని గుర్తించినందుకు అందరికి నా ధన్యవాదాలు. ఎప్పుడు ఇలాగే గుర్తిస్తూ ఉండండి. అది నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. లవ్యూ ఆల్" అంటూ పోస్ట్ చేశారు.