మహారాష్ట్ర ఎన్‌కౌంటర్ లో ఏడుగురు మావోలు హతం!

SMTV Desk 2017-12-06 15:10:35  encounter, maharastra, maoist, koombing

ముంబై, డిసెంబర్ 06: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా సిరొంచ మండలం జంగనూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా , మృతుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారు. సంఘటనా స్థలంలో ఆయుధాలు, మావోయిస్టుల కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఎదురుకాల్పుల నేపథ్యంలో పోలీసులు అక్కడ కూంబింగ్ ముమ్మరం చేస్తూ, అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.