మార్చి-ఏప్రిల్‌ నాటికే విలీనం ముగింపు....

SMTV Desk 2017-12-06 15:07:17  vodafone, idea, barath india,

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: టెలికాం దిగ్గజ సంస్థలు విలీనానికి సిద్ధమయ్యాయి. ఐడియా-వొడాఫోన్‌ విలీన ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. మొదట సెప్టెంబర్‌ 2018 నాటికి పూర్తి చేయాలని భావించిన సంస్థలు, మార్చి-ఏప్రిల్‌ నాటికే ముగించేయాలని ఐడియా సెల్యూలర్‌ లీడర్‌షిప్‌ సమావేశాన్ని ఉటంకిస్తూ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా-మెరిల్‌ లించ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టెలికాం రంగ౦లో అగ్రస్థానంలో నిలిచిన ఈ రెండు సంస్థలు విలీనం తరువాత ఏ విధంగా ఉండబోతున్నాయోనని అందరికీ ఆసక్తి నెలకొంది.