న్యూఢిల్లీ, డిసెంబర్ 05 : అయోధ్యలోని భూమికి సంబంధించిన కేసు విచారణను 2018 ఫిబ్రవరి 8 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్సిబల్ సంబంధిత పత్రాలను అనువాదానికి గడువు కావాలని కోరడంతో ఈ కేసును ఫిబ్రవరి 8కి తదుపరి విచారణ వాయిదా వేస్తూ.. పిటిషనర్కు ఇదే చివరి అవకాశం అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ అశోక్ భూషణ్, అబ్దుల్ నజీబ్తో కూడిన ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది.