ముంబాయి, డిసెంబర్ 5: పతాంజలి ఉత్పత్తులతో దూసుకెళ్తున్న బాబా రామ్ దేవ్, ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్బంగా పతాంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ... స్వదేశీ ఉద్యమానికి అనుగుణంగా సోలార్పవర్ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తున్నామని, ప్రతి ఇంటికి సోలార్విద్యుత్ అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ .100 కోట్ల పెట్టుబడితో గ్రేటర్ నోయిడాలోని కర్మాగారాన్ని 20 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో నెలకొల్పోడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో అడ్వాన్స్ నావిగేషన్ అండ్ సోలార్ టెక్నాలజీస్తో ఒప్పందం చేసుకుంది. ఇకపై చైనా సోలార్ ఉత్పత్తుల సంస్థకు కూడా బాబా రామ్ దేవ్ చెక్ పెడుతారని మార్కెట్ వర్గాల సమాచారం.