ఆఫ్రికా , డిసెంబర్ 05 : ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఒకటైన పీస్ డైమండ్ (శాంతి వజ్రం)ని బ్రిటన్కి చెందిన ధనవంతుడు లారెన్స్ గ్రాఫ్ సొంతం చేసుకున్నారు. 709 కేరెట్ల ఈ వజ్రాన్ని 6.5 మిలియన్ డాలర్లకు ఆఫ్రికా దేశమైన సియోర్రా లియోన్ అమ్మేసింది. దీన్ని అమ్మడం ద్వారా అక్రమంగా జరిగే వజ్రాల ట్రేడింగ్ని అరికట్టవచ్చని సియోర్రా లియోన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. అధికారికంగా ఓ వజ్రాన్ని వేలం వేయడం సియోర్రా లియోన్ చరిత్రలో ఇదే మొదటిసారి.