నైజీరియన్ల నయా మోసం...

SMTV Desk 2017-12-05 17:10:48  nigerians, cyber crime, duplicate website, arrest, apollo

హైదరాబాద్, డిసెంబర్ 05: చదువు నిమిత్తం వచ్చి నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అపోలో ఫార్మసీ పేరిట నకిలీ వెబ్ సైట్ ప్రారంభించి ప్రమాదకర పొటాషియం సైనైడ్, నిద్రమాత్రల వివరాలుంచిన అడేయామి అలియాస్ టిమోని, అయోబ్ హ్యాపీనెస్ లను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పూణే నుంచి ఈ మోసాలకు పాల్పడుతూ బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును స్థానికుల బ్యాంకు ఖాతాలో జమచేసి కమిషన్ పద్దతిలో తీసుకునేవారు. వీరిపై అపోలో అధికారుల ఫిర్యాదు మేరకు ఐటీ, పాస్ పోర్ట్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ చాంద్ పాషా తెలిపారు.