హైదరాబాద్, డిసెంబర్ 05 : నగర కమిషనర్ గా మహేందర్రెడ్డి పోలీసింగ్లో వ్యవస్థలో సరికొత్త మార్పులను తీసుకువచ్చేందుకు కృషి చేశారు ఇటీవల డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన ఆయన మరిన్ని కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి మహేందర్రెడ్డి అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. పోలీస్ స్టేషన్ లను ఆధునికీకరించడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో జిల్లాలన్నింటికి ఒకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు. దీనికోసం ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని పక్కా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు.