హైదరాబాద్, డిసెంబర్ 05: ఎన్నికల కోసం కేసీఆర్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని తెతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు. మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి ఆయన ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని, ఇన్ని రోజులు చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు ఎందుకు గుర్తు రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. బీసీ ఓటు బ్యాంకు తన ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ చూస్తుందని, బీసీలు ఎప్పుడు టీడీపీ వెంటే ఉంటారని రమణ పేర్కొన్నారు. కేసీఆర్ దొంగ హామీలకు బీసీలు మోసపోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.