న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ఫిరోజ్ షా కోట్లాలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా రంగంలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్లో అద్భుత శతకం బాదిన ఓపెనర్ మురళీ విజయ్ 12 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 9 ఓవర్లు ముగిసేసరికి 24 తో ఉంది. శిఖర్ ధావన్(6), అజింక్య రహానె(9) క్రీజులో ఉన్నారు.