అనంతపురం, డిసెంబర్ 04 : నేటి నుంచి అనంతపురం వైపుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కొద్దీ సేపటికిత్రం ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా చేపట్టిన ఈ యాత్ర నేటికి 26 రోజుకు చేరుకుంది. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసినేపల్లిలో కాసేపటి క్రితం వైఎస్ జగన్ యాత్ర ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ముందుకు కొనసాగించనున్నారు. తొలుత గుత్తి ఆర్ఎస్కు పాదయాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నం అక్కడే ఆయన భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతోంది.