ముంబాయి, డిసెంబర్ 4: గత కొద్ది రోజులుగా డీలా పడిపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు, సోమవారం ట్రేడింగ్లో లాభాలతో ఆరంభమయ్యాయి. ప్రారంభంలో 150 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్, ప్రస్తుతం 31 పాయింట్ల లాభంలో 32,937 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10,118 వద్ద కొనసాగుతోంది. బయోకాన్ కూడా 10 శాతం లాభాలు పండిస్తోంది. ఒకవైపు ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, భారతీ, ఐబీ హౌసింగ్, ఐషర్, బాష్, యాక్సిస్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ 2-1 శాతం మధ్య లాభపడగ, మరోవైపు విప్రో, టెక్ మహీంద్రా, ఆర్ఐఎల్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, సిప్లా, హెచ్పీసీఎల్, టీసీఎస్ 1.6-0.5 శాతం మధ్య నష్టాలతో ఉన్నాయి.