పట్నా, డిసెంబర్ 4: క్రికెట్ ఆట చరిత్రలోనే బీహార్ అరుదైన మైలురాయిని అందుకుంది. ఆదివారం విజయ్ మర్చంట్ అండర్-16 ట్రోఫీ వేదికగా, జరిగిన టోర్నీ మ్యాచ్ లో బీహార్ 870 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది. మొదట బ్యాటింగ్కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 83 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బీహార్ బ్యాట్స్మెన్ బిన్నీ ట్రిపుల్ సెంచరీ, ప్రకాశ్ డబుల్ సెంచరీతో పాటు అర్ణవ్ కిశోర్ వేగవంతమైన సెంచరీతో 7 వికెట్లు కోల్పోయి 1007 పరుగుల చేసి డిక్లెర్ ఇచ్చింది. లక్ష్యచేదనలో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ 54 పరుగులకే ఆలౌట్ అయింది.