వరుస సిక్సర్లతో మాథ్యూస్‌ హాఫ్ సెంచరీ

SMTV Desk 2017-12-03 17:25:43  angelo mathews, srilanka, team india,

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: టీమిండియాతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ 118 బంతుల్లో 57 పరుగులు చేసి అర్ధశతకం సాధించాడు. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 28వ ఓవర్‌లో రెండు, మూడు బంతుల్లో వరుస సిక్సర్లు బాదాడు. సారథి దినేశ్‌ చండిమాల్‌ (25), పెరేరా (42) పరుగులు చేయగా 44 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 131 /3 గా నిలిచింది.