మరో భారతీయుడి పై పేలిన తుట

SMTV Desk 2017-06-15 12:42:45  america, indian,work killing

న్యూఢిల్లీ, జూన్ 15 : ఈ మధ్య అమెరికాలో చాలా కాల్పులు జరుగుతున్నాయి. అందులో భారతీయులపై ఎక్కువ కాల్పులు చేస్తున్నారు. అలాంటి సంఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పటాస్ జిల్లాకు చెందిన సమీర్ హస్ ముఖ్ పటేల్ (24) అనే యువకుడు అట్లాంటాలో ఓ షాప్ లో పనిచేస్తున్నారు. ఆ రోజు సోమవారం రోజున రాత్రి సమయంలో దుకాణం ముసేందుకు సిద్దమవుతున్నారు. అదే టైం కి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు షాప్ లోకి వచ్చి రాగానే సమీర్ పై కాల్పులు జరిపారు. బుల్లెట్ల దెబ్బకు తీవ్రంగా గాయపడిన సమీర్ అక్కడే సృహ కోల్పోయాడు. తరువాత దుండగులు షాప్ లో నగదును తీసుకోని పరారయ్యారు. సమీర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు సిద్దమౌతున్నారు.