మొగుడు కాదు మృగం...

SMTV Desk 2017-12-03 11:52:54  harrasment, crime, chittoor,

చిత్తూరు, డిసెంబర్ 3: కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా కర్కశంగా ప్రవర్తించాడు ఓ భర్త. తొలి రాత్రే ఆమెను బ్లేడుతో కాళ్ళు, చేతులు కోసి క్రూర మృగంలా ఎగబాకాడు. అసలు ఎందుకు అలా చేశాడు? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్ ప్రభుత్వ టీచర్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు. దాంపత్య జీవితానికి పనికి రాని రాజేష్, శైలజ అనే అమ్మాయిని వివాహం చేసుకొని, శోభనం నాటి రాత్రి అసలు సంగతి తన భార్యకు చెప్పాడు. మోసం చేసి తనను పెళ్ళాడాడని శైలజ, ఈ రహస్యాన్ని అందరికీ చెప్పింది. ఈ విషయంపై రాజేష్ కోపంతో గదిలోకి తీసుకెళ్ళి నోటిలో బట్టలు కుక్కి పిడిగుద్దులు గుద్దుతూ బ్లేడుతో శరీరమంతా తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం శైలజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య పోరాడుతుంది.