చెన్నై, డిసెంబర్ 2: తమిళనాడు రాజకీయాలలో వరుసగా సినీపరిశ్రమకు చెందిన నటులు రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. తాజాగా తమిళ నటుడు విశాల్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. మాజీ సీఎం జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడడంతో ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విశాల్ బరిలోకి దిగనున్నారు. ఆయన డిసెంబర్ 4వ తేదిన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులతో శశికళ మేనల్లుడు దినకరన్ శుక్రవారం నామినేషన్లు వేశారు. ఈ ఉపఎన్నికలు డిసెంబరు 21న జరుగగా, 23న ఫలితాలు వెలువడనున్నాయి.