యాసిడ్ దాడి నిందితుల అరెస్ట్...

SMTV Desk 2017-12-02 19:19:43  acid attak in warangal, 3 mens arrested, acp madhusudan.

వరంగల్, డిసెంబర్ 02 : వరంగల్‌లో మట్టెవాడకు చెందిన మాధురి అనే మహిళపై ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసిన ఘటన తెలిసిందే. ఆమెపై దాడి చేసి అనంతరం కాళ్ళు, చేతులు కట్టేసి పొదల్లో పడవేయగా గమనించిన స్థానికులు తనను వరంగల్ ఎంజీఏం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించి వారిని మీడియా ఎదుట హాజరుపర్చారు. ఈ కేసులో నిందితులుగా తేలిన ముగ్గురు వ్యక్తులను రాకేష్‌, అనిల్, చంద్రశేఖర్ లుగా గుర్తించి వారిని అరెస్టు చేశామని ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు. యాసిడ్ దాడి చేసింది వారేనని నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. కాగా నిందితుల్లో చంద్రశేఖర్ అనే వ్యక్తి బాధితురాలి మాజీ భర్తగా అనుమానిస్తున్నారు.