బ్లేడుతో గాయపరిచిన శాడిస్ట్ భర్త...

SMTV Desk 2017-12-02 17:26:59  harrasment, crime, chittoor

చిత్తూరు, డిసెంబర్ 2: మూడు ముళ్ళు వేసి 24 గంటలు కాకముందే భార్యకు నరకం చూపించాడు ఓ శాడిస్ట్ భర్త. ఈ ఘటన చిత్తూరు జిల్లా మేర్ధానపల్లెలో చోటుచేసుకుంది. పెళ్లి అయిన తొలి రాత్రే భార్యను, బ్లేడుతో శరీరమంతా కోసి చిత్రహింసలు పెట్టాడు. ప్రస్తుతం ఆ నవ వధువు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విధంగా సైకోలా ప్రవర్తించిన ఆ భర్త ఓ ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.