భారీ ప్యాకేజీలతో ఐఐటీ ప్లేస్‌మెంట్స్

SMTV Desk 2017-12-02 13:09:40  micro soft, iit students, madras guwahati campus

మద్రాసు, డిసెంబర్ 2: టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ, ఐఐటీ విద్యార్ధులకు భారీ ప్యాకేజీని ఆఫర్‌ చేసింది. ఆఫ్‌షోర్‌ పొజిషన్లలో భాగంగా వార్షిక వేతనంగా రూ.1.39 కోట్ల వేతన ప్యాకేజీని ఐఐటీ రూర్కే, బొంబై, మద్రాస్‌, గౌహతి క్యాంపస్‌ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. రూర్కే నుంచి ముగ్గుర్ని, గౌహతికి రెండు ఆఫ్‌షోర్‌ ఆఫర్లు, ఎనిమిది మందికి దేశీయ ఆఫర్లను అందించింది. ఈ ప్లేస్‌మెంట్లను మద్రాసు, గౌహతి క్యాంపస్‌లలో చేపట్టారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆఫర్లు, వేతన ప్యాకేజీలు స్వల్పంగా పెరిగినట్టు ప్లేస్‌మెంట్‌ అధికారులు పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ సంస్థ బ్లాక్‌స్టోన్‌ దేశీయ పొజిషన్ల కోసం అ‍త్యధిక మొత్తంలో రూ.35 లక్షల వరకు ప్యాకేజీని ఆఫర్‌ చేసింది. మొదటి రోజే తొలి స్లాటు ముగిసే లోపు 99 విద్యార్థులు ప్లేస్‌ అయినట్టు, గతేడాది ఈ సంఖ్య 77గానే ఉన్నట్లు ఐఐటీ మద్రాసు ప్లేస్‌మెంట్‌ డ్రైనింగ్‌, అడ్వయిజరీ మను శాంతనమ్‌ తెలిపారు.