న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే౦దుకు ఎయిర్ టెల్ పోటి పడుతుందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 199తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 1జీబీ 3జీ/4జీ డేటాతో పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, అపరిమిత ఎస్ఎంఎస్ సేవలను అందించనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఈ ఆఫర్ కొత్తగా చేరే ఎయిర్టెల్ వినియోగదారులకు కూడా వర్తిస్తుందని పేర్కొ౦ది. ప్రస్తుతం ఈ ఆఫర్ చెన్నై, దిల్లీ-ఎన్సీఆర్, ముంబయి, కర్ణాటక తదితర ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.