భారత్ బ్యాటింగ్...ధావన్, పుజారా ఔట్

SMTV Desk 2017-12-02 10:47:31  india, srilanka, test, new delhi, india won toss

న్యూఢిల్లీ, డిసెంబర్ 02 : ఫిరోజ్ షా కోట్లా వేదికగా లంకతో జరుగుతున్న మూడో టెస్ట్ లో భాగంగా కోహ్లి సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ డ్రా కాగా, నాగపూర్ లో భారత్ విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా టీమిండియా విజయం సాధించి 2-1 తో సిరీస్ ను చేజిక్కుంచుకోవాలని చూస్తుంది. తన సోదరి వివాహం కారణంగా రెండో టెస్ట్ కు దూరమైనా శిఖర్ ధావన్ మరల జట్టులోకి వచ్చారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (23) స్పిన్నర్‌ దిల్రువాన్‌ పెరీరా బౌలింగ్ లో స్వీప్‌ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. నయా వాల్ పుజారా (23), పరుగుల వద్ద గమేగా వేసిన 20 వ ఓవర్లలో పెవిలియన్ కు చేరాడు. లంచ్ విరామ సమయానికి భారత్ 116 పరుగులు చేసి 2 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(17), మురళీ విజయ్(51), ఉన్నారు.