న్యూఢిల్లీ, డిసెంబర్ 01 : ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన రూట్లలో టికెట్ ప్రారంభ ధరను రూ.1,112లకే విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఎంపిక చేసిన రూట్లలో ధరలు ఈ విధంగా ఉన్నాయి. * జమ్ము-శ్రీనగర్ టికెట్ ధర - రూ. 1,112 * కోయంబత్తూరు- చెన్నై ప్రారంభం ధర - రూ.1,195 * విశాఖపట్టణం-హైదరాబాద్ టికెట్ ధర - రూ.1,259 * పట్నా-కోల్కతా టికెట్ ధర - రూ.1,264 * బెంగళూరు-చెన్నై టికెట్ ధర - రూ.1,285 గా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా మరో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా లిమిటెడ్ పీరియడ్ ప్రమోషనల్ స్కీమ్ కింద ఎంపిక చేసిన విమానాల్లో 40 శాతం తగ్గింపును అందిస్తోంది. కాగా ఈ ఆఫర్ జనవరి 15 నుంచి ఏప్రిల్ 25 వరకు మాత్రమే వర్తిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.