ఖరారైనా అమరావతి సచివాలయ నమూనా...

SMTV Desk 2017-12-01 15:49:04  amaravathi Secretariat, buliding samples, CRDA Chairmen cherukoori sreedhar.

అమరావతి, డిసెంబర్ 01 : అమరావతి నగరంలో నిర్మించనున్న సచివాలయం భవనాల నమూనాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపినట్లు సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో నమూనాలను పరిశీలించి ప్రాథమికంగా రెండు క్యాటగిరిల్లోని ఆరు నమూనాలను ఎంపిక చేశారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఒకే చోట ఉండే విధంగా ఉన్న భవన నమూనాలకు ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ నమూనాలను సీఆర్డీయే వెబ్ సైట్, సామాజిక మాధ్యమ౦, మన అమరావతి యాప్ లో ఉంచి ప్రజల నుండి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. అత్యధికంగా ప్రజల నుండి ఎంపికైన నమూనాను తుది దశలో నిర్మాణానికి ఎంపిక చేస్తారని కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు.