న్యూఢిల్లీ, డిసెంబర్ 1 : భారత్- శ్రీలంక మధ్య ఢిల్లీ వేదికగా చివరి టెస్ట్ రేపు జరగనుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ విజయంతో ఫుల్ జోష్ మీదున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ 2-0 ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు సాధన చేస్తూ కన్పించారు. సారథి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, విజయ్ శంకర్ నెట్స్ లో చెమటోడ్చరు. ప్రస్తుత ఫాం పరంగా భారత్ జట్టును నిలువరించడం లంకేయలకు శక్తికి మించిన పని. తొలి టెస్ట్ లో వరుణుడి ప్రభావం వల్ల బతికిపోయిన శ్రీలంక, నాగపూర్ లో భారత్ అల్ రౌండర్ షో కారణంగా ఘోర ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్ తర్వాత పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ విరామం తీసుకోనున్న విషయం తెలిసిందే.