పరుగుల వీరుడి ముంగిట మరో రికార్డు !

SMTV Desk 2017-11-30 18:21:24  kohli, records, india, srilanka, test series

న్యూఢిల్లీ, నవంబర్ 30 : భారత్ క్రికెట్ సారధి కోహ్లీ వరుసుగా రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఎవ్వరు ఉహించని విధంగా అందరి రికార్డులను అధిగమిస్తున్నాడు. తాజాగా మరో రికార్డు ముంగిటకు కోహ్లీ చేరుకున్నాడు. వచ్చే నెల 2న భారత్ -శ్రీలంక మధ్య ఢిల్లీలో జరిగే చివరి టెస్ట్ గెలిస్తే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంటుంది. ఈ విజయంతో భారత్ వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్‌ తన ఖాతాలో వేసుకున్నట్లువుతుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా ఉంది. దిల్లీలో జరిగే టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తే ఆసీస్ రికార్డును టీమిండియా సమం చేయనుంది. అంతే కాకుండా విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగా మరో రికార్డుకు చేరువయ్యాడు. టెస్టు క్రికెట్లో కోహ్లీ 5వేల పరుగుల పూర్తి చేయడానికి కేవలం 25 పరుగుల తేడా మాత్రమే ఉంది. ఈ టెస్టులో ఆ పరుగులు పూర్తి చేస్తే ఇండియా తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన 11వ ఆటగాడిగా నిలుస్తాడు.